గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది

by Gantepaka Srikanth |
గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరద సృష్టించిన బీభత్సంతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గినా.. వరద ముంపు కొనసాగుతుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ.. పలు కాలనీల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల వరద బాధితులకు పడవలు, వాహనాల ద్వారానే ఆహారం, వాటర్‌ ప్యాకెట్లు అందిస్తున్నారు అధికారులు, వివిధ స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు. మరోవైపు బాధితులకు అండగా ఉండేందుకు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గొప్ప మనసు చాటుకున్నారు. ఎక్స్ ఆర్మీ ఉద్యోగులు అయిన పవన్ కళ్యాణ్ సిబ్బంది.. కర్నల్ అర్జున్ నేతృత్వంలో బాధితులకు దుప్పట్లు, తాగు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed