‘గత సీఎం లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు’:Deputy CM Pawan

by Jakkula Mamatha |
‘గత సీఎం లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు’:Deputy CM Pawan
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని.. అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు’ అని పవన్ అన్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నం అంటున్నారు అని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పైనే ఫోకస్ పెట్టామని, పగలు ప్రతీకారాలు ఉండవని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘన పైనే మా ఆవేదన అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Read More..

ఈసారి వైసీపీని ఒకే సీటుకు పరిమితం చేస్తా.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Next Story