తెలుగు రాష్ట్రాల‌కు భారీ విరాళం ప్ర‌క‌టించిన నారా భువ‌నేశ్వ‌రి

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 15:48:03.0  )
తెలుగు రాష్ట్రాల‌కు భారీ విరాళం ప్ర‌క‌టించిన నారా భువ‌నేశ్వ‌రి
X

దిశ,వెబ్‌డెస్క్:భారీ వ‌ర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల్లోని పలు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్ర‌ముఖులు ముందుకు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి చొప్పున విరాళం ఇస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. "కష్ట స‌మ‌యంలో ప్రజలకు అండగా నిలబడాలి. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతి పెద్ద సాయం. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల‌ మీద ప్రభావం చూపించాయి. వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సహాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం. అందుకే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జ‌రిగింది. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది" అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed