ఐదేళ్లుగా అభివృద్ధి నిల్.. ఏపీ మంత్రి ఫైర్

by srinivas |
ఐదేళ్లుగా అభివృద్ధి నిల్.. ఏపీ మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత ఐదేళ్లు సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనసాగించిన విషయం తెలిసిందే. అయితే సంక్షేమానికి ఆయన పీట వేశారు. అభివృద్ధి విషయంలో వెనకపడినట్లు ఆ పార్టీ నేతలు పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇవే కామెంట్స్ మంత్రి సవిత చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ అభివృద్ధి చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో పర్యటించిన ఆమె దాచుకోవడం దోచుకోవడం అన్నట్టుగా జగన్ పాలన సాగిందని ఆరోపించారు. మద్యం, ఇసుకతో సహా అన్నింటిలోనూ వైసీపీ నాయకులు వాటాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఇంచు కూడా అభివృద్ధి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి సవిత చెప్పారు.



Next Story