నిరుద్యోగులకు గుడ్ న్యూస్: అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

by srinivas |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా 1998 డీఎస్సీ(DSC-1998) బాధితుల సమస్యపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు(BJP MLA Vishnukumar Raju) ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో మంత్రి లోకేష్‌ స్పందించారు. 1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చామని, ఇంకా 600 ఖాళీలు ఉన్నాయని, త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. లీగల్‌ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Next Story