ఐటీ విస్తరణపై కీలక నిర్ణయం.. నాస్కామ్‌కు మంత్రి లోకేశ్ పిలుపు

by srinivas |
ఐటీ విస్తరణపై కీలక నిర్ణయం.. నాస్కామ్‌కు మంత్రి లోకేశ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణపై మంత్రి నారా లోకేశ్ ఫోకస్ పెట్టారు. ఏఐ, డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాస్కామ్‌కు లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఐటీ సేవలను విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను లేఖలో వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను సైతం రాష్ట్రానికి బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. మౌలిక సదుపాయాలు, మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నాస్కామ్‌కు రాష్ట్రం తరపున ఆహ్వానం పలుకుతున్నామని లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక కొత్త కంపెనీల బిల్లు యోచనపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తిగా ఉందని తమకు తెలిసిందని, తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని లేఖలో తెలిపారు. స్కిల్ కలిగిన యువత, వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులకు ఆంక్షలు ఉండవని అన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు కొనసాగతాయని లేఖలో మంత్రి లోకేశ్ భరోసా కాల్పించారు

Read More..

కువైట్‌లో ఇరుక్కుపోయానని వీడియో.. స్పందించిన మంత్రి నారా లోకేష్.. క్షేమంగా ఇంటికి చేరిన శివ



Next Story