AP Assembly:ధాన్యం బకాయిలపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన

by Jakkula Mamatha |
AP Assembly:ధాన్యం బకాయిలపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన
X

దిశ ప్రతినిధి,విజయవాడ:గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిందని, అందులో కష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు చెల్లించి రైతులను ఆదుకునే దిశలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇప్పటికే మొదటి విడత వెయ్యి కోట్లు సాయం అందించడం జరిగింది అని , మరో రానున్న 10, 15 రోజులలో 1674 కోట్ల బకాయిలను చెల్లించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే సివిల్ సప్లై శాఖ పై 39,550 కోట్ల రుణాలు చేసి చివరకు రైతులకు అందించాల్సిన రుణాలను కూడా అందించకుండా వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది అని అన్నారు. కచ్చితంగా రైతులను ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు.



Next Story