Nara Lokesh: నేడు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

by karthikeya |
Nara Lokesh:  నేడు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Footmarch) సందర్భంలో ఇచ్చిన తొలి హామీ మేరకు చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. ఈ రోజు (గురువారం) సాయంత్రం స్వయంగా ప్రారంభం కూడా చేయబోతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బంగారుపాళ్యం చేరుకోనున్న మంత్రి నారా లోకేశ్ (Dialasys Centre).. మరికొద్ది సేపట్లో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed