శ్రీశైలానికి తరలి వస్తున్న కన్నడ భక్తులు

by Jakkula Mamatha |
శ్రీశైలానికి తరలి వస్తున్న కన్నడ భక్తులు
X

దిశ, న్యూస్ శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కన్నడ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్ద సంఖ్యలో పాదయాత్ర వస్తున్నారు. ఎండలు సైతం లెక్కచేయకుండా కర్ణాటక మహారాష్ట్ర భక్తులు నల్లమల అడవుల గుండా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. బేలూటీ, నాగులూటీ, భీముని కొలను మీదుగా నల్లమల కొండల్లో కఠోరమైన పాదయాత్ర సాగిస్తున్నాడు. మార్గమధ్య అడవుల్లోనే భక్తులు సేద తీరుతున్నారు.

కైలాస ద్వారం హటకేశ్వరం సాక్షి గణపతి వద్ద భక్తులకు అన్నదానం అల్పాహారం అందజేస్తున్నారు కన్నడ యువకులు కాళ్లకు చక్రాలు కట్టుకుని కాలినడకన వస్తూ ఆకట్టుకుంటున్నారు. దర్శనం ముగిసిన తరువాత భక్తులు తమ ప్రాంతాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఈ నెల 27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో కన్నడ భక్తుల తాకిడి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Next Story

Most Viewed