- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu:‘ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే’.. నామినేటెడ్ పదవుల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ,వెబ్డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారం చేపట్టిన ఆరు నెలల్లో రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల(Nominated posts)ను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సీఎం చంద్రబాబు(CM Chandrababu) నామినేటెడ్ పదవుల పై స్పందించారు. సీఎం చంద్రబాబు నేడు(మంగళవారం) పార్టీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్(Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూన్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులను నియామాకాలు ఉంటాయని పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ క్రమంలో మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించి.. సమస్యలు పరిష్కరించాలి. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పని చేయాలి. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలి. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ప్రజల్లో సంతృప్తి ఉండాలి. భవిష్యత్పై నమ్మకం, భరోసా కలగాలి. ఇదే కూటమి ప్రభుత్వ విధానం. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం...భవిష్యత్తులో ఏం ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలి.
చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారు. వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల్లో విజయం అన్నారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలి. ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.