భర్తకు సెక్యూరిటీ కుదింపు.. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనస్థాపం

by srinivas |
భర్తకు సెక్యూరిటీ కుదింపు.. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనస్థాపం
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్తకు సెక్యూరిటీ తొలగింపుపై ఆమె మనస్థాపం చెందారు. ప్రాణ హాని ఉందని, ఎన్నికలకు ముందు మాధవి రెడ్డితో పాటు భర్త శ్రీనివాసుల రెడ్డికి 2+2 గన్ మెన్లను పోలీస్ శాఖ కేటాయించింది. అయితే తాజాగా మధవీ రెడ్డి భర్త శ్రీనివాసుల రెడ్డి సెక్యూరిటీని 1+1కు కుదించారు. దీంతో ఆమె మనస్థాపం చెందారు. తన గన్‌మెన్లను సైతం వెనక్కి పంపారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదన్నారు. అసెంబ్లీకి కూడా గన్‌మెన్లు లేకుండా వెళ్లారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పాటు చేసిన గన్ మెన్లను ఇప్పుడు తొలగించడాన్ని మాధవిరెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. 2+2 గన్ మెన్లను కేటాయించాలని సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సమాచారం.



Next Story