ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్.. అందుకేనా...!

by srinivas |
ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్.. అందుకేనా...!
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండటంతో పొత్తులపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అటు కేంద్రమంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ప్రధానంగా పొత్తులు, పరిస్థితులపైనే చర్చలు జరిగాయి. తాజాగా అమిత్ షా కూడా స్పందించారు. పాత మిత్రులను తాము ఎప్పుడూ మర్చిపోలేదని.. పొత్తులు కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తమ నుంచి వెళ్లిపోయారు.. తప్ప తాము పొమ్మలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమంటూ తేలిపోయింది. ఇందుకోసమే పవన్ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్తున్నారని, బీజేపీ అధిష్టానంతో చర్చల తర్వాత కీలక అప్ డేట్ వస్తుందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్లు, స్థానాలపై సైతం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Read More..

Breaking: మరో సంచలన నిర్ణయం.. వారికి కీలక బాధ్యతలు

Advertisement

Next Story

Most Viewed