AP News:ప్రకాశం జిల్లాలో హై టెన్షన్.. బాలినేని ఫ్లెక్సీలు చించివేత

by Jakkula Mamatha |
AP News:ప్రకాశం జిల్లాలో హై టెన్షన్.. బాలినేని ఫ్లెక్సీలు చించివేత
X

దిశ, డైనమిక్​ బ్యూరో: ఒంగోలు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రేపు జనసేన పార్టీలోకి చేరడానికి మాజీ మంత్రి బాలినేని సిద్ధమయ్యారు. దీంతో నిన్న ఆయన అభిమానులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అయితే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించివేయడంతో ఇది ఎవరి పని అనేది ఆరా తీస్తున్నారు. పట్టణంలో నాలుగైదు చోట్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. బాలినేని జనసేనలో చేరడం ఇటు టీడీపీ, అటు జనసేన ఒంగోలు నేతలకు ఇష్టం లేదు. ఇది గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.

మూడు రోజుల కిందట కూడా బాలినేని ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేశారు. ఆ ఫ్లెక్సీలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఫొటో ఉండటమే అందుకు కారణం. ఇదే విషయాన్ని టీడీపీ కార్యకర్తలు వెల్లడించి, ఫ్లెక్సీలను తొలగించి వాటిని కార్పొరేషన్​ సిబ్బందికి అప్పగించారు. దీంతో మూడు రోజులుగా ఒంగోలులో ఫ్లెక్సీల టెన్షన్ కొనసాగుతోంది. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనుండగా.. ఇప్పటికే ఒంగోలులో రాజకీయ వేడి చల్లారాక పోవడం చర్చనీయాంశమైంది. బాలినేని రాకను స్థానిక టీడీపీ, జనసేన క్యాడర్​ ఇష్టపడకపోవడం.. జనసేన పార్టీ అధినేత మాత్రం పార్టీలో చేర్చుకోవడానికి ఆహ్వానించడం.. కార్యకర్తలకే మింగుడు పడడం లేదు.

Next Story

Most Viewed