- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
10th exam results-2025:పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల పై కీలక అప్డేట్!

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 17వ తేదీన ప్రారంభమై ఈ నెల(ఏప్రిల్) 1వ తేదీతో ముగిశాయి. ఈ క్రమంలో ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయో అని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల(ఏప్రిల్) 3వ తేదీన ప్రారంభమై 9వ తేదీన ముగిసింది.
ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh)లో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల(10th exam results-2025) విడుదలకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీన పది పరీక్ష ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు bse.ap,gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.