మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద జేడీ లక్ష్మీనారాయణ గాంధీగిరి (మీరే చూడండి..)

by srinivas |
మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద జేడీ లక్ష్మీనారాయణ గాంధీగిరి (మీరే చూడండి..)
X

దిశ, వెబ్ డెస్క్: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. జేడీ లక్ష్మినారాయణ, చలసాని శ్రీనివాస్‌తో పాటు మరికొందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. అయితే వారు అక్కడ గాంధీ గిరీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు.

అయితే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూనే ఉంటామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా ప్రత్యేక హోదా హామీ కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంతో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సీఎంకు నోరు రాకుంటే సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, విద్యార్థి సంఘాలతో కలిసి ప్రధాని మోడీని అడుగుదామని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Read More..

Political:ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి సాక్షం ఇదే..టీడీపీ కీలక నేత!


Advertisement

Next Story

Most Viewed