ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

by Y. Venkata Narasimha Reddy |
ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కర్ణాటక లోని బెటిపిన్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఖాళీ డీజిల్ ట్యాంక్‌ గూడ్స్ రైలు నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాకినాడ సమీపంలోని గంగినేని ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరింది. రైలు స్టేషన్ చేరుకోగానే కేవలం 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు చివరి 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే 5వ లైన్ లో ప్రమాదం జరగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది రాలేదు. మరో రైలును తెప్పించి పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్లను తిరిగి పట్టాలపైకి ఎక్కించారు. 1, 2 లైన్లపై యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు.

యుద్ధ ప్రాతిపదికపై లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు రైల్వే అధికారులు రైలు పట్టాలు తప్పడంపై విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

Next Story

Most Viewed