డిప్యూటీ సీఎం ఆ బాధ్యత తీసుకోవాల్సిందే.. మాజీ మంత్రి దాడి శెట్టి సంచలన డిమాండ్

by srinivas |
డిప్యూటీ సీఎం ఆ బాధ్యత తీసుకోవాల్సిందే.. మాజీ మంత్రి దాడి శెట్టి సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: బీసీల్లో కాపుల చేరికపై మాజీ మంత్రి దాడి శెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల్లో కాపుల చేరిక బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాపులతో ఎన్డీయే కూటమికి పవన్ కల్యాణ్ ఓట్లు వేయించారని, అందువల్ల బీసీల్లో కాపుల చేరిక బాధ్యతను ఆయనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తునిలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న దాడి శెట్టి.. బీసీల్లో కాపుల చేరికపై 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై అటు కేంద్రం కూడా అనుకూలంగా ఉందని, కూటమి నాయకులు ఒత్తి చేసి బీసీల్లో కాపులను చేర్చాలని మాజీ మంత్రి దాడి శెట్టి రాజా డిమాండ్ చేశారు



Next Story