Earthquake: శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Shiva |   ( Updated:2024-08-28 15:25:24.0  )
Earthquake: శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3.45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ గురయ్యారు. ఒక్క సారిగా నిద్రలో నుంచి లేచి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అసలు ఏం జరగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఏంటని ఒకరికొకరు చర్చించుకున్నారు. అయితే, ఇచ్చాపురం పరిసర ప్రాంతంలో భూ కంపించడం పట్ల అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story