కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ హైజాక్ చేసింది..దగ్గుబాటి పురంధేశ్వరి

by Indraja |
కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ హైజాక్ చేసింది..దగ్గుబాటి పురంధేశ్వరి
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నంద్యాల లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముని జన్మ స్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని భారతదేశ ప్రజలు కొన్ని శతాబ్దాల నుండి కల కంటున్నారని.. ఆ కల రేపటితో నెరవేరనుంది దేశమంతా హర్షం వ్యక్తం చేస్తూ.. రేపు ఒక్క రోజైన ఆ రాముని నామ స్మరణతో కాలం గడపాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకిటించక పోవడం దారుణమని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను వైసీపీ ప్రభత్వం హైజాక్ చేసి తమ ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుంటుందని ఆరోపించారు.

ఓర్వ కల్లులో విమానాశ్రయ నిర్మాణానికి బీజేపీ ప్రభత్వం నిధులు ఇస్తే ఆ నిధులు వైసీపీ ఇచ్చినట్లు చెప్పుకోవడం నిజంగా దారుణం అని వెల్లడించారు. ఇక జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు విషయం నేటికీ కొనసాగుతోందని.. అయితే తుది నిర్ణయం మాత్రం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. అలానే రేపు జరగనున్న శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా వీక్షించాలని పిలుపునిచ్చారు. తాను కూడా రేపు శ్రీశైలంలో శివయ్య దర్శనం చేసుకుని.. అక్కడ నుండే లైవ్ లో రాముని విగ్రహ ప్రతిష్టను చూస్తానని పేర్కొన్నారు. ఇక రేపు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని బీజేపీ తరపున ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story