సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు .. ఎందుకంటే!

by Seetharam |
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా సూళ్లూరు పేట పర్యటన రద్దు అయ్యింది. సూళ్లూరుపేటలో మంగళవారం సీఎం వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. నియోజకవర్గంలో సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. అనంతరం తడ మండలం మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటం... హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో సీఎం వైఎస్ జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed