- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP News:‘అమరావతి మునిగిపోయింది’..ప్రచారం పై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
దిశ,వెబ్డెస్క్: ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ చిన్న ఘటనను కూడా వదిలిపెట్టకుండా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు.
‘అమరావతి మునిగిపోయింది’..ఇక్కడేం రాజధాని కడతారని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లెవరూ ఈ విధంగా మాట్లాడరని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడి ఇళ్లలోకి వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతనైతే ఏదైనా సహాయం చేయండి..అంతేకానీ ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దు అని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో ఒక భ్రష్టు పట్టిన పార్టీ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు ప్రచారాలు రాసినప్పుడు అందులోని అంశాలను నిరూపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.