AP News:‘అమరావతి మునిగిపోయింది’..ప్రచారం పై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-01 12:07:10.0  )
AP News:‘అమరావతి మునిగిపోయింది’..ప్రచారం పై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ చిన్న ఘటనను కూడా వదిలిపెట్టకుండా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు.

‘అమరావతి మునిగిపోయింది’..ఇక్కడేం రాజధాని కడతారని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లెవరూ ఈ విధంగా మాట్లాడరని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడి ఇళ్లలోకి వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతనైతే ఏదైనా సహాయం చేయండి..అంతేకానీ ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దు అని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో ఒక భ్రష్టు పట్టిన పార్టీ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు ప్రచారాలు రాసినప్పుడు అందులోని అంశాలను నిరూపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed