టీడీపీ నేత హఠాన్మరణంపై CM చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

by Anjali |
టీడీపీ నేత హఠాన్మరణంపై CM చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే రామకృష్ణ ఆదివారం మరణించారు. రామకృష్ణ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. టీడీపీ నేత, ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ అకాల మరణం బాధాకరమన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన రామకృష్ణ అశ్రునివాళులు అర్పిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Advertisement

Next Story

Most Viewed