- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Ap News: ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
![Ap News: ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన Ap News: ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన](https://www.dishadaily.com/h-upload/2024/06/12/342494-chandrababu.webp)
దిశ, వెబ్ డెస్క్: జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్ధమవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచీ చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత అయిదేళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవటంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.