- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP News:ఏపీ మహిళలు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్
దిశ,వెబ్డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటిని విద్యార్థులు, డ్వాక్రా మహిళలు తక్కువ ధరకు పొందగలరు. ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ సైకిల్ పర్యావరణానికి హాని చేయవు.
విద్యార్థులు త్వరగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్తారు. బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే మహిళలు వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్ధ్య విద్యుత్ పరికరాలను సబ్సిడీ పై ఇవ్వాలని సీఎం ఆలోచనలు చేస్తున్నారు. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాలు తక్కువ ధరకే పొందగలరు. అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వస్తువుల్ని సబ్సిడీకి ఇస్తామని సీఎం చెప్పారు.