AP News:సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-24 06:41:49.0  )
AP News:సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది. అర్హత ఉన్నవారు ఈ నెల 27లోగా దరఖాస్తులు సమర్పించాలి. కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరుకావాల్సి ఉంటుంది. 29 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తారు. అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు తెలియజేయవచ్చు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story