BREAKING: అక్కాచెల్లెళ్లకు మరోసారి షాకిచ్చిన కడప కోర్టు.. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

by Disha Web Desk 1 |
BREAKING: అక్కాచెల్లెళ్లకు మరోసారి షాకిచ్చిన కడప కోర్టు.. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ వైఎస్ షర్మిల, సునీతకు మరోసారి కడప కోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేక కూమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. అయతే, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ అక్కాచెల్లెళ్లు వేసిన పిటిషన్‌ను కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను కడప కోర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలంటూ కోర్టు తెలిపింది.

Read More...

న్యాయం కోసం వివేకా రక్తం ఘోషిస్తూనే ఉంది:వైఎస్ షర్మిల

Next Story