విషాదం.. వాగులో బాలుడు గల్లంతు

by Jakkula Mamatha |
విషాదం.. వాగులో బాలుడు గల్లంతు
X

దిశ, పెదకూరపాడు: పెదకూరపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముస్సాపురం గ్రామంలో ఓ బాలుడు నీటి కాలువలో గల్లంతయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం నలుగురు పిల్లలు ఈతకు వెళ్లగా పాటిబండ్ల మహీదర్(12) నీట మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రి పాటిబండ్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed