నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

by Disha Web Desk 12 |
నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా కేవలం 23 సీట్లతో సరి పుచ్చుకున్న జనసేన పార్టీ అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుండగా.. ఆ పార్టీ కీలక నేతలు, నాగబాబు, నాదేండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్న వారితో చర్చలు జరిపి సర్ది చెబుతున్నారు.

Next Story