AP News:ఎన్నికల వేళ..ఆ జిల్లాలో నాటు బాంబుల కలకలం

by Disha Web Desk 18 |
AP News:ఎన్నికల వేళ..ఆ జిల్లాలో నాటు బాంబుల కలకలం
X

దిశ,మాచర్ల: మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో నాటుబాంబులు కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగమహేశ్వరపాడులో టీడీపీ సానుభూతిపరుడు నాగరాజు నివాసంలో నాటుబాంబులు ఉన్నట్లు సీఐకు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎస్ కోటయ్య బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాగరాజు నివాసంలో నాటుబాంబులు వేట కొడవళ్ళు కత్తులు ఇనప రాడ్డులు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా మాచర్ల నియోజకవర్గం ఉలిక్కిపడింది. దాదాపుగా నాటు బాంబులు కనిపించక రెండు దశాబ్దాలు గడిచాయి.

ఎన్నికల నేపథ్యంలో ఈ బాంబులు స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి సంఘటనలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. పోలీసులు పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్న బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు తెచ్చిపెట్టి ఉంటారు..అనే దానిపై విచారణ చేపట్టారు. తాజాగా తనిఖీల్లో బయటపడ్డ నివాసంలో నాగరాజు గత నాలుగు సంవత్సరాల నుంచి ఉండడం లేదు. ఊరు వదిలి వేరేచోట నివసిస్తున్నారు. అటువంటి ఇంట్లో ఎవరు ఈ బాంబులు పెట్టారు అనే దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Next Story