ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు భారీ ఊరట.. ఆనందోత్సాహాల్లో జన సైనికులు

by Shiva |
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు భారీ ఊరట.. ఆనందోత్సాహాల్లో జన సైనికులు
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పార్టీకి ఇప్పుడున్న గాజు గ్లాసునే ఎన్నికల్లో గుర్తుగా ఖరారు చేస్తూ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరాయి. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును మాత్రమే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రసాద్ ఇవాళ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు అందజేశారు. ఈ పరిణామంతో జనసేన కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. పోటీకి సై అంటూ జన సైనికులు సమరానికి సై అంటూ ముందుకెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed