AP: రాష్ట్రంలో విశాఖను మించిన నగరం లేదు: మాజీ మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
AP: రాష్ట్రంలో విశాఖను మించిన నగరం లేదు: మాజీ మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు రిఫరెండం అని అన్నారు. అయినా.. రాష్ట్రంలో విశాఖను మించిన నగరం లేదని, దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అమరావతితో పాటు విశాఖను కూడా సమంగా అభివృద్ధి చేయాలని కోరారు.



Next Story