AP: చివరి నిమిషంలో ప్రొగ్రాం ఛేంజ్.. జగన్ పులివెందుల టూర్ వాయిదా

by Shiva |
AP: చివరి నిమిషంలో ప్రొగ్రాం ఛేంజ్.. జగన్ పులివెందుల టూర్ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ పులివెందులకు పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో వెనువెంటనే తన పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆయన ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకు ప్రతి సమాధానం ఉండేలా ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ప్రతి ఇష్యూపై స్టడీ చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 20న తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed