AP: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ దెబ్బ అదుర్స్.. ఏపీ డీజీపీతో సహా ఎస్పీలు అవుట్!

by Shiva |
AP: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ దెబ్బ అదుర్స్.. ఏపీ డీజీపీతో సహా ఎస్పీలు అవుట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆ పార్టీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దింపేందుకు పథకాలను రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో పోలీసు శాఖ నుంచి ఆ పార్టీకి ఏ మాత్రం సహకారం లేకుండా చేసేందుకు పక్కాగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్పీ ఆనంద్ రెడ్డి అలా మొత్తం 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నిక విధుల నుంచి తప్పించాలంటూ ఆమె ఎలక్షన్ కమీషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే డీజీపీపై, ఇతర అధికారులపై వేటు వేసేందుకు ఈసీ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed