వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మరో కీలక నేత

by Jakkula Mamatha |
వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మరో కీలక నేత
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈనెల 22న జనసేనలో చేరడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌తో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు జగ్గయ్యపేటలో అభిమానులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తనతో కలిసొచ్చే వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.

Advertisement

Next Story

Most Viewed