ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి: సజ్జల

by srinivas |   ( Updated:2023-10-08 10:46:55.0  )
ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి: సజ్జల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో సోమవారం వైసీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రజలకు కావాల్సినవన్నీ సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే ఏదో విప్లవకారుడు జైలుకు వెళ్లినట్లు టీడీపీ నేతలు పీలవుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed