AP:‘సీబీఐ ఎంక్వైరీకి నేను రెడీ.. నువ్వు రెడీనా’.. టీడీపీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి సవాల్

by Jakkula Mamatha |
AP:‘సీబీఐ ఎంక్వైరీకి నేను రెడీ.. నువ్వు రెడీనా’.. టీడీపీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న(శుక్రవారం) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పు పై టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు (శనివారం) మాజీ మంత్రి కాకాణి నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. తాను చెప్పిన పనులు అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఎద్దెవా చేశారు.

సూరాయిపాలెం(Suraipalem) ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్తామని తెలిపారు. తనపై సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. ఈ క్రమంలో సోమిరెడ్డికి కాకాణి గోవర్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణా(Sand smuggling)లో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీబీఐ(CBI) దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నానని.. తాను తప్పు చేసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని సోమిరెడ్డిని కాకాణి ప్రశ్నించారు. కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed