మెడికల్ వ్యాపారి అదృశ్యం.. గగ్గోలుపెడుతున్న అప్పులు ఇచ్చిన బాధితులు

by Anjali |
మెడికల్ వ్యాపారి అదృశ్యం.. గగ్గోలుపెడుతున్న అప్పులు ఇచ్చిన బాధితులు
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఓ మెడికల్ వ్యాపారి నాలుగు రోజుల నుంచి కనిపించటం లేదు.సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. కుటుంబంతో సహా నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్లినట్టు ఇంటి చుట్టుపక్కల వారు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కోట ప్రాంతంలో మెడికల్ వ్యాపారం చేసే రాంబాబు అనే వ్యాపారి నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పలువురు వ్యాపారులకు రూ. 15 కోట్ల వరకు అప్పులు ఉన్నట్టు తెలిసింది. ప్రముఖ మందుల కంపెనీలకు కూడా కోట్లలో బకాయిలు ఉన్నట్టు వ్యాపార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాంబాబుకు భారీగా అప్పులు ఇచ్చిన వారు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొత్త సమస్యలు వస్తాయేమోనని భయపడి బయటకు చెప్పుకోలేక విలవిలలాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed