యూఎస్లో సనాతన ధర్మ దినోత్సవం..
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న లూయిస్ విల్లే సిటీ మేయర్ క్రెయిగ్ గ్రీన్బెర్గ్ కీలక ప్రకటన చేశారు.
వాషింగ్టన్ : అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న లూయిస్ విల్లే సిటీ మేయర్ క్రెయిగ్ గ్రీన్బెర్గ్ కీలక ప్రకటన చేశారు. ఏటా సెప్టెంబర్ 3న సిటీలో సనాతన ధర్మ దినోత్సవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. లూయిస్విల్లేలో ఉన్న హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో మేయర్ తరఫున డిప్యూటీ మేయర్ బార్బరా సెక్ట్సన్ స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి సమక్షంలో ఈ ప్రకటన చేశారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ తదితరులు పాల్గొన్నారు.