United States: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అలబామా లోని ఓ బార్‌లో కాల్పులు జరిగగా.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

Update: 2024-09-22 09:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అలబామా రాష్ట్రంలోని ఓ బార్‌లో తాజాగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. బర్మింగ్ హామ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో ఉన్న బార్‌లోకి శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా చొరబడిన దుంగడులు పౌరులపై సామూహిక కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరణించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రాంతం అలబామా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉండటం గమనార్హం. కాగా, ఈ ఏడాది అమెరికాలో సుమారు 403 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి.


Similar News