టర్కీ పార్లమెంట్‌ వద్ద సూసైడ్ ఎటాక్..

Update: 2023-10-01 11:10 GMT

అంకారా: టర్కీ పార్లమెంట్‌ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దేశ హోంశాఖ ఆఫీసు సమీపంలో జరిగిన సూసైడ్ ఎటాక్ లో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈవివరాలను టర్కీ హోంశాఖ మంత్రి అలీ యెర్లికయ ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం ఓ వాహనంలో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు టర్కీ పార్లమెంట్‌‌లోని సెక్యూరిటీ జనరల్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం గేటు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక దళాలు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నాయి. ఆదివారం టర్కీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న సూసైడ్ ఎటాక్ తో అంతటా కలకలం చెలరేగింది.


Similar News