G20 summit: జీ20 సదస్సుకు పుతిన్ హాజరుకారు..

వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న జీ20 కూటమి సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు.

Update: 2023-08-25 12:18 GMT

మాస్కో : వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న జీ20 కూటమి సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న సదస్సుకు పుతిన్ హాజరు కాబోరని ఆయన తెలిపారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిన నేపథ్యంలోనే పుతిన్ విదేశీ పర్యటనలను ఆపేశారనే చర్చ జరుగుతోంది. విదేశాలకు వెళితే.. అరెస్టయ్యే ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా బ్రిక్స్ సదస్సులోనూ పుతిన్ వర్చువల్‌గానే ప్రసంగించారు. జీ20 సదస్సులోనూ అదే విధంగా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Similar News