Malaysia : మలేసియాలో ఘోరం..మ్యాన్ హోల్లో పడి గల్లంతయిన తెలుగు మహిళ

మలేషియాలోని కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ మ్యాన్ హోల్లో పడి గల్లంతయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

Update: 2024-08-24 23:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలేషియాలోని కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ మ్యాన్ హోల్లో పడి గల్లంతయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన మహిళ విజయలక్ష్మి (45) గత కొంత కాలంగా కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటోంది. పనిలో భాగాంగా ఆమె నివాసం ఉంటున్న బజార్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఫుట్ పాత్ ఒక్కసారిగా కుంగిపోవడంతో మ్యాన్ హోల్ లో పడిపోయింది. గమనించిన స్థాని కులు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక అధికారులు ఆమె ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి గల్లంతు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


Similar News