Hezbollah : హిజ్బుల్లా ప్రతీకార దాడులు.. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికుల మృతి

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది.

Update: 2024-09-19 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మంగళ, బుధవారాల్లో లెబనాన్‌లో పలుచోట్ల పేజర్లు, వాకీటాకీలు, సోలార్ పరికరాలు పేలడంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. 32 మంది చనిపోగా, 3200 మందికి గాయాలయ్యాయి. ఆ దాడులను ఇజ్రాయెలే చేసిందని ఆరోపించిన హిజ్బుల్లా.. గురువారం రోజు ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడ్డింది.

హిజ్బుల్లా ప్రయోగించిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ ధాటికి వెస్టెర్న్ గెలీలీ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. మరో ఎనిమిది మంది సైనికులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 


Similar News