Bus Accident: చైనాలో ఘోర ప్రమాదం..స్కూల్ బస్సు ఢీకొని 11 మంది మృతి..!
చైనాలో (China) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: చైనాలో (China) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాన్డాంగ్ ప్రావిన్స్(Shandong province) లోని తైయాన్ నగరంలో మంగళవారం ఓ ప్రభుత్వ పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించారని, అలాగే 13 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో తైయాన్ నగరంలోని ఒక మిడిల్ స్కూల్ గేటు వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని డాంగ్పింగ్ కౌంటీ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.మరణించిన వారిలో ఆరుగురు తల్లిదండ్రులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.