బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి
దిశ, భీమ్గల్ : ఉమ్మడి నిజామాబాద్లో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన భీమ్గల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోన్గొప్పుల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. మృతురాలిని జరంగుల బాలమణి (35)గా గుర్తించినట్టు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాల్లోకివెళితే.. వేల్పూర్కు చెందిన జరంగుల బాలామణి తన సోదరుడు జరంగుల నర్సయ్యతో కలిసి పని నిమిత్తం సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత చిన్న వాల్గోట్ నుంచి […]
దిశ, భీమ్గల్ : ఉమ్మడి నిజామాబాద్లో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన భీమ్గల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోన్గొప్పుల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. మృతురాలిని జరంగుల బాలమణి (35)గా గుర్తించినట్టు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాల్లోకివెళితే.. వేల్పూర్కు చెందిన జరంగుల బాలామణి తన సోదరుడు జరంగుల నర్సయ్యతో కలిసి పని నిమిత్తం సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామానికి వెళ్లారు.
ఆ తర్వాత చిన్న వాల్గోట్ నుంచి భీమ్గల్కు తిరిగి బైక్ పై వస్తుండగా ఏపీ 25 ఏఈ 0943 నెంబరు గల ట్రాక్టర్ వెనుక నుంచి వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న బాలమణి కిందపడిపోగా.. ఆమె తలపై నుండి ట్రాక్టర్ వెల్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న జరంగుల నర్సయ్యకు గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.