పదేళ్ల అనాథ బాలికపై అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి

భువనగిరి జిల్లా‌ కేంద్రంలోని బాలసదన్ లో దారుణం

Update: 2024-10-21 03:19 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి జిల్లా‌ కేంద్రంలోని బాలసదన్ లో దారుణం చోటు చేసుకుంది. అనాథ బాలికపై జిల్లా లీగల్ సర్వీసెస్ కు చెందిన అటెండర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న బాలసదన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ఈ కార్యక్రమానికి డీసీపీఓతో పాటు మరికొందరు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి నిందితుడు కూడా డీసీపీ వో తో పాటు వచ్చాడు.

అదే సమయంలో ఓ బాలిక రూమ్ లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.‌ అదే విషయాన్ని ఏడుస్తూ వచ్చి విషయాన్ని బాలసదన్ సిబ్బందికి చెప్పింది. అయిన కూడ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.‌ విషయం బయటకు వస్తే అందరూ ఉద్యోగాలు పోతాయంటూ అందులోని ఓ అధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు బాధితురాలిని భువనగిరి బాలసదన్ నుంచి వలిగొండలోని ఒక ప్రైవేటు అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు. అనంతరం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.‌ దీనిపై ఫిర్యాదు రావడంతో భువనగిరి పట్టణ పోలీసులు ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Similar News