మాజీ సర్పంచ్‌కు దేహశుద్ధి

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం మత్తులో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డాడు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇరువురిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

Update: 2021-02-06 01:13 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం మత్తులో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డాడు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇరువురిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

Tags:    

Similar News