లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి 

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిలో నకరికల్లు వై జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలు నాదెండ్ల మండలం అవిశాయపాలెంకి చెందిన కోమటినేని అనసూర్య (65)గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు సాయిపాలెం నుంచి ఇనిమెట్ల వెళుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-11-02 02:26 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిలో నకరికల్లు వై జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలు నాదెండ్ల మండలం అవిశాయపాలెంకి చెందిన కోమటినేని అనసూర్య (65)గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు సాయిపాలెం నుంచి ఇనిమెట్ల వెళుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News