Trending: వనస్థలిపురంలో ఆకట్టుకుంటున్న ముత్యాల గణపతి

వనస్థలిపురంలో ఆకట్టుకుంటున్న ముత్యాల గణపతి

Update: 2024-09-12 06:04 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ మాసాన్ని గణేషుడుకు అంకితం చేసారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది గణేష్ చతుర్థి పండగ సెప్టెంబర్ 7 న వచ్చింది. ఆ రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా చాలా మంది గణపతి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉదయం, సాయంత్రం పూజలు చేసి తొమ్మిదవ రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు.

ప్రస్తుతం వినాయక పండుగ వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇళ్లలో చేసే ఏ శుభకార్యాలైన గణపతి పూజ తర్వాతే మిగిలిన పనులు చేస్తారు. ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలోనే వనస్థలిపురంలోని కమ్యూనిటీ హాల్‌లో ముత్యాల గణేషుడిని తయారు చేసారు. మొత్తం 1116 ముత్యాలను అతికించి అద్భుతంగా తయారు చేశారు. ఈ విగ్రహం అందర్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ముత్యాల గణేషుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. అక్కడికి వెళ్లి చూసిన వారు.. ముత్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Tags:    

Similar News