పరారైన ప్రేమికులు.. ఘర్షణకు దిగిన ఇరుకుటుంబాలు!

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఆస్పరి మండలం బినిగేరి గ్రామాన్ని పోలీసులు తమ అదుపులోనికి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ప్రేమికులు ఎవరికీ చెప్పకుండా పరారవ్వడంతో యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గట్టి […]

Update: 2021-01-01 22:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఆస్పరి మండలం బినిగేరి గ్రామాన్ని పోలీసులు తమ అదుపులోనికి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ప్రేమికులు ఎవరికీ చెప్పకుండా పరారవ్వడంతో యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు.

అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News